• రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా గేమ్ ఛేంజర్
  • భారీ బడ్జెట్ ఫై నిర్మిస్తున్న దిల్ రాజు
  • సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ అనాన్స్ చేసిన మేకర్స్

మెగా పవర్ స్టార్  రామ్‌ చరణ్‌ హీరోగా, శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’. షూటింగ్ మొదలు ఏళ్ళు కావొస్తుంది. అప్పుడెప్పుడో ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసి సైలెంట్ గా ఉన్నారు మేకర్స్. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ స్టార్ యాక్టర్ SJ సూర్య విలన్ రోల్ లో కనిపించనున్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్‌, అంజలి, నవీన్‌ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Also Read : Devara : ఏపీ / తెలంగాణ దేవర అడ్వాన్స్ సేల్స్ వివరాలు..

మరోవైపు తమ హీరో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. తాజాగా  ఈ సినిమా గురించి కీలక ఆప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలోని  “రా మచ్ఛా మచ్చా” అంటూ సాగే సెకండ్ సింగిల్ పోస్టర్ రిలీజ్ చేసారు. కానీ ఇప్పుడే అనేది డేట్ కూడా మెన్షన్ చేయలేదు మేకర్స్. ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సహానికి గురయ్యారు. కనీసం డేట్ కూడా లేకుండా ఏంటి అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల చేయబోతున్నారని తమన్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.  పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా  రానున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెటుకున్నారు. IAS ఆఫీసర్ గా, పొలిటిషన్ గా రెండు పాత్రలో అలరించనున్నాడు చరణ్. క్రిస్మస్ బరిలో దిగుతున్న గేమ్ ఛేంజెర్ ఎన్ని రికార్డులను కొల్లగొడుతుందో చూడాలి.మరోవైపు ఈ సినిమా cg వర్క్ నిమిత్తం లాస్ ఏంజెల్స్ ఉన్నారు శంకర్.