• విశాఖలోని కంటైనర్ టెర్మినల్‌లో అగ్నిప్రమాదం
  • చైనా నుంచి లిథియం బ్యాటరీలతో వచ్చిన కంటైనర్‌లో మంటలు
  • ఆర్పేసిన పోర్టు ఫైర్‌ సిబ్బంది

Fire Accident: విశాఖలోని కంటైనర్ టెర్మినల్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. చైనా నుంచి లిథియం బ్యాటరీలతో వచ్చిన కంటైనర్‌లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్మేయడంతో పోర్ట్ ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశారు. ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. గత నెల 28న చైనా నుంచి వచ్చిన కంటైనర్ కోల్‌కతాకు వెళ్లాల్సి వుంది. ఇవాళ ట్రాలర్‌పై లోడ్ చేసిన కొద్ది సేపటికే ప్రమాదం జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్‌కు గల కారణాలపై అంతర్గత విచారణ జరుగుతోంది. కంటైనర్‌లలో లిథియం బ్యాటరీలు ఉన్నట్లు గుర్తించారు.

Read Also: Tragedy: చాయ్‌పత్తా అనుకుని పురుగుల మందుతో టీ.. వృద్ధ దంపతులు మృతి

మరోవైపు విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రమాదం జరిగిన సమీపంలోనే సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు తెలిసింది. ఈ అగ్నిప్రమాదం తర్వాత వెంటనే చిత్రబృందం అప్రమత్తమైంది. వెంటనే అక్కడి నుంచి తరలివెళ్లినట్లు సమాచారం.అక్కడ 10 రోజులుగా రజనీకాంత్ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు తెలిసింది. మూవీ యూనిట్ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

https://www.youtube.com/watch?v=NARBOsavDAI