ఈ వార్తను అనువదించండి:

తెలంగాణలో సర్పంచుల పదవి కాలం అయిపోయి దాదాపు ఏడు నెలలు గడుస్తోంది. పంచాయతీ ఎన్నికలతో పాటు ఇతర స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరగతాయనే దానిపై ఇంకా ప్రశ్నలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో బీసీ కుల గణన చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఈ అంశంపై సీఎం రేవంత్‌ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. మరో మూడు, నాలుగు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఆలోపే బీసీ కుల గణన కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలను వెలికి తీయాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకునేందుకు కాంగ్రెస్ నేతలందరూ గట్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

పూర్తిగా చదవండి..