ఈ వార్తను అనువదించండి:
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాణి కుముదినిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం పార్థసారధిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించగా.. ఆయన పదవీకాలం ఇటీవలే ముగిసింది. మరికొన్ని రోజుల్లో ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తారన్న ప్రచార సాగింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కొత్త వారినే ఆ పదవిలో నియమించాలని భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి అయిన రాణి కుముదిని నియామకం జరిగింది. కుమిదిని 1988 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆమె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పని చేశారు.
పూర్తిగా చదవండి..
కేంద్ర సర్వీసుల అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమెను కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అయితే.. 2023 ఎన్నికలకు ముందు ఆమె పదవీ విరమణ చేశారు. గత కేసీఆర్ సర్కార్ ఆమెను అదే హోదాలో కొనసాగించింది. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఆమెకు అత్యంత కీలకమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బాధ్యతను అప్పగించింది. మూడేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. తెలంగాణలో మరికొన్ని నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ తదితర స్థానిక ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల నిర్వహణ కొత్త కమిషనర్ కు ఛాలెంజ్ గా మారనుంది.
[vuukle]