ఈ వార్తను అనువదించండి:

TG రేషన్ కార్డ్: తెలంగాణ ప్రజలకు మరో రెండు నెలల్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. కుటుంబాల వార్షిక ఆదాయం ఆధారంగానే కార్డులు ఇచ్చేందుకు క్యాబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆదాయ పరిమితి తగ్గించాలా, ఉన్నదాన్నే కొనసాగించాలా అన్నదానిపై కమిటీ చర్చిస్తోంది. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ నేతృత్వంలో గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఏపీలో అమల్లో ఉన్న విధానాలను ఇప్పటికే అధ్యయనం చేయగా.. నివేదికను ఉపసంఘానికి అందించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

పూర్తిగా చదవండి..