దగ్గు, గొంతు నొప్పి, కీళ్ళ నొప్పులు, జీర్ణక్రియ, డిప్రెషన్ వంటి సమస్యలకు మంచి ఔషధం. పీరియడ్స్ నొప్పి తగ్గేందుకు, ఆకలి పెంచడానికి, తలనొప్పి, బరువు తగ్గడానికి మిరియాలను మిక్సీలో పట్టి పొడి చేసుకోవాలి. తర్వాత బెల్లం తురుమును కూడా పొడి చేసుకోవాలి. రోజు పరిగడుపున ఈ రెండు కలిపి ఒక టీ స్పూను తీసుకుంటే.. గొంతు నొప్పి, జలుబు, దగ్గు లాంటివి తగ్గిపోతాయి. పిల్లలకు పాలలో కలిపి ఇచ్చిన ఉపశమనం లభిస్తుంది. అయితే ఇలా నేరుగా తీసుకోలేని వాళ్ళు మిరియాలు పొడి, బెల్లం కలిపి ఆ నీటిని తాగిన జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా.. ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. మహిళలకు పీరియడ్స్ సమస్యలు ఉంటే దీనిని తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతున్నది.
ఆకలి కాదని చాలామంది చెబుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మిరియాలు, బెల్లం తింటే ఆకలి పెరుగుతుంది. కొందరికి డిప్రెషన్ కారణంగా తలనొప్పి కూడా పెరుగుతుంది. అలాంటివారు ఉదయం, సాయంత్రం మిరియాల పొడి, బెల్లం కలిపి తింటే తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ మధ్యకాలంలో చాలామంది అధిక బరువు పెరిగి చెడు కొలెస్ట్రాల్తో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు బరువు తగ్గాలి అనుకుంటే జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మిరియాలు, బెల్లం కలిపి తింటే ఫిట్గా ఆరోగ్యంగా ఉంటారు. కొవ్వు వల్ల రక్తనాళాల్లో అధిక కొవ్వు ఉండి రక్తపోటు నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
[vuukle]