జయం రవి తన కాలేజీకి చెందిన ఆర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు అబ్బాయిలకు తల్లిదండ్రులు అయిన తర్వాత జయం రవి, ఆర్తిలు ఇప్పుడు అభిప్రాయభేదాల కారణంగా విడాకుల దాకా చేరుకున్నారు. ఆర్తి తన విడాకుల గురించి నిర్ణయం ప్రకటించకముందే… జయం రవి తన విడాకుల నిర్ణయాన్ని ముందుగానే ప్రకటించాడు. చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో విడాకుల పిటిషన్‌ను కూడా దాఖలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆర్తి వైపు నుంచి సంచలన ప్రకటన వెలువడింది. తన భర్త రవిని కలవకుండా చాలాసార్లు అడ్డుకున్నారని, రవి నిర్ణయంతో ఏం చేయాలో అర్థం కాక తాను, తన పిల్లలు ఇబ్బంది పడుతున్నామని అందులో ఆవేదన వ్యక్తం చేసింది. ఇది రవి పూర్తిగా తన సొంత నిర్ణయమని ఆర్తి ధృవీకరించారు, అతని ప్రవర్తనపై చర్చలు జరుగుతున్నప్పుడు, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని, ఇది తన పిల్లలకు తల్లిగా నిలబడాల్సిన సమయం అని అన్నారు.

Pure EV : వచ్చే ఐదేళ్లలో ప్యూర్ ఈవీ పెను సంచలనం.. 2 వేల కోట్ల టర్నోవరే టార్గెట్!

ఆర్తి చెప్పిన ఈ మాటల్లో నిజం ఉందని చాలా మంది చెబుతున్నా.. జయంరవితో ఆర్తి దిగిన ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించడం ఏంటి? అని కొందరు ప్రశ్నించడం కూడా కనిపించింది. నటుడు జయం రవి విడాకుల ప్రకటన ప్రకటించిన తర్వాత, ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు, అయితే తమిళ మీడియాలో మాత్రం గాయని కెనీషాతో జయం రవికి ఉన్న సంబంధమే ఈ విడాకులకు కారణమని అనేక కథనాలు ప్రచురించబడ్డాయి. నటుడు జయం రవి ఇటీవలి కాలంలో గోవాలో వెకేషన్ లో ఉన్నాడు. అలాగే జూన్ 4వ తేదీన అంటే జయం రవి – ఆర్తిల పెళ్లి రోజు కూడా జయం రవి ఆర్తి సహా కుటుంబంతో లేరు. గత 14 ఏళ్లుగా తన పెళ్లి రోజు ఎలాంటి షూటింగ్ జరిగినా పట్టించుకోకుండా భార్య, కుటుంబ సభ్యులతో కలిసి ఉండేవాడినని, అయితే ఈ ఏడాది మాత్రం షూటింగ్ చేస్తున్నానని జయం రవి తెలిపాడు.

అయితే షాకింగ్ విషయం ఏమిటంటే నిషేధిత బ్లాక్ సన్ ఫిల్టర్ పేపర్ ను తాను కొనుగోలు చేసిన కారుకు అంటించారని ఆ రోజే పోలీసులు జరిమానా విధించారు. ఇది ఆర్తి పేరు మీద కొన్న కారు కావడంతో నేరుగా ఆమెకే SMS వెళ్లింది. ఇది చూసి షాక్ తిన్న ఆర్తి.. షూటింగ్ అని చెప్పి గోవా ఎందుకు వెళ్లారంటూ పలు ప్రశ్నలు వేస్తూ గొడవకు దిగిందట. అప్పుడు జయం రవి ఎవరితో ఉన్నాడో… ఆర్తీ తన సన్నిహితుల ద్వారా ఆరా తీస్తే కెనీషా పేరు బయటకు వచ్చిందని తెలుస్తోంది. ఆ సమయంలో కెనీషా ఒక్కరే కాదు.. చాలా మంది స్నేహితులు ఉన్నారని చెప్పడంతో ఆర్తి శాంతించిందని తెలుస్తోంది.

ఇక 10 రోజుల తర్వాత మరో సమస్య వచ్చినట్లు సమాచారం. జూన్ 24న జయం రవి కారు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిందని, అతివేగంగా నడుపుతున్నట్లు ఆర్తి సెల్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ రాగా అది చెక్ చేయగా కెనీషా కారు నడుపుతున్నట్లు తేలింది. ఇక నేరుగా గోవా వెళ్లి ఆరా తీస్తే జయం రవి ఎప్పుడూ గోవాకు వస్తే ఆయన సాధారణంగా బస చేసే హోటల్ లో ఉండడం లేదని తేలిందట. అదేవిధంగా గాయని కెనీషాతో కలిసి జయం రవి విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేసి అక్కడే ఉంటున్నట్టు కొన్ని కథనాలు వచ్చినా… ఇప్పటి వరకు ఆ నివేదికలు ఏవీ ధృవీకరించబడలేదు. ఇక ఎడిటర్ మోహన్ కుమారుడు అయిన జయం రవి జయం సినిమాతో తమిళంలో మంచి పేరు సంపాదించాడు.