ఈ వార్తను అనువదించండి:

Chandrababu Naidu: రాష్ట్ర ప్రజలకు టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు ఓ శుభవార్త చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై బుధవారం ఆయన ఓ కీలక ప్రకటన చేశారు. ఈ దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‎ను అమలు చేస్తామని తెలిపారు. దీపావళి పండుగ రోజున అర్హులకు తొలి ఉచిత సిలిండర్ అందిస్తామని.. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా పేదలకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందజేయనున్నట్లు సీఎం తెలిపారు.

పూర్తిగా చదవండి..