ఈ వార్తను అనువదించండి:

రవ్‌నీత్ బిట్టు: కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఉగ్రవాది అంటూ వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టుపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక కాంగ్రెస్ కమిటీ నాయకుడు కేంద్రమంత్రి రవనీత్ సింగ్‌ బిట్టుపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. దేశంలో నెం.1 టెర్రరిస్టు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అని బిట్టు ఇటీవల వ్యాఖ్యానించారు. ఇటీవల రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో భాగంగా భారత దేశంలోని సిక్కుల గురించి ఉద్దేశించి మాట్లాడారు. ఇండియాలో సిక్కులకు మత స్వేచ్ఛ లేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యనించారు. రాహుల్ మాటలపై బీజేపీతో పాటు, కొందరు సిక్కులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.

పూర్తిగా చదవండి..