ఈ వార్తను అనువదించండి:

ఏపీలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం దుమారం రేపుతోంది. వైసీపీ హయాంలో జంతవుల నుంచి తయారుచేసిన నూనెను లడ్డూ తయారీలో వాడారంటూ సీఎం చంద్రబాబు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని NDDB CALF ల్యాబ్ ధృవీకరించిందనట్లు తాజాగా టీడీపీ బయటపెట్టింది. 2024, జులై 8న లడ్డులో కలిపిన నెయ్యి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించగా.. జులై 17న ల్యాబ్‌ రిపోర్టు ఇచ్చింది. నెయ్యిలో సోయాబిన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బిన్, మొక్కజొన్న, పత్తి గింజల నూనెతో సహా.. ఫిష్‌, ఆయిల్, పామాయిల్, గొడ్డు కొవ్వు వాడినట్లు తేలిందని టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకట రమణారెడ్డి తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో నెయ్యి కొనుగోళ్లలో ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించలేదని మండిపడ్డారు.

పూర్తిగా చదవండి..