• మళ్ళి కెమెరా ముందుకు పవర్ స్టార్
  • చక చక షూటింగ్స్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి
  • OG షూటింగ్ పై రాని క్లారిటీ

ఎన్నికల కారణంగా సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చాడు పవర్ స్టార పవన్ కళ్యాణ్. దీంతో అయన నటిస్తున్న హరహర వీరమల్లు, OG చిత్ర షూటింగ్స్ మధ్యలోనే ఆగిపోయాయి. ఇటీవల జరిగిన ఎన్నికలల్లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ అడుగు పెట్టి, ఏపీ డిప్యూటీ సీఎంగా ఉంటూనే, పలు మంత్రివర్గ శాఖల బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆగిపోయిన సినిమాల సంగతి ఏమిటని ఆ మధ్య టాక్ వినిపించింది. ఇందుకు సంబంధించి తాజాగా కీలక అప్ డేట్ వచ్చింది.

Also Read : MADSquare : లడ్డు గాని పెళ్లితో షురూ చేసిన మ్యాడ్ బాయ్స్

షూటింగ్ మధ్యలో ఆగిపోయిన ‘OG'(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) సినిమాను పూర్తి చేస్తానని గతంలో పవన్ ఓ బహిరంగ సభలో తెలిపాడు. ఎప్పుడెప్పుడు ఆ రెండు సినిమాల షూట్ స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చేస్తున్నారు.ఇటీవల తనను కలిసిన నిర్మాతలకు అందుకు సంభందించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవర్ స్టార్. పరిపాలన పరంగా ఎక్కడా ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసుకుని షూటింగ్ లో పాల్గొంటానని సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో విఙయవాడలో అందుకు తగ్గ సెట్స్ కూడా ఏర్పాటు చేసారు మేకర్స్. ఈ నెల 23 నుండి హరిహర వీరమల్లు షెడ్యూల్ స్టార్ట్ కానుంది, హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ పావెల్ సారథ్యంలో భారీ యుద్ధ సాన్నివేశాలను పవను కళ్యాణ్ పై చిత్రీకరించనున్నారు. పవన్ కళ్యాణ్ ను ఇంతకూ ముందుపెన్నడూ చూడని విధంగా సరికొత్తగా చూపించబోతున్నాడు దర్శకుడు జ్యోతి కృష్ణ. పవర్ స్టార్ కు జోడిగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.