• ‘రాజాసాబ్‌’ షూటింగ్‌ అప్‌డేట్ ఇచ్చిన హీరోయిన్
  • ప్రభాస్‌పై మాళవిక ప్రసంసల వర్షం

Malavika Mohanan: వరుస విజయాలతో దూసుకెళ్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన రాబోయే చిత్రం ‘రాజాసాబ్‌’లో విభిన్నమైన శైలిలో ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధంగా ఉన్నాడు. 400 కోట్ల బడ్జెట్‌తో రొమాంటిక్ హారర్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న తన అభిమానుల హృదయాలను శాసించే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఈ రోజుల్లో తన చిత్రం ‘కల్కి 2898 AD’ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. అయితే ‘కల్కి’ సినిమాతో పాటు ప్రభాస్ ఇప్పుడు డిఫరెంట్ స్టైల్‌లో ప్రేక్షకులను నవ్వించేందుకు వస్తున్నాడు. ఇదొక రొమాంటిక్ హారర్ కామెడీ అని అంటున్నారు. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై చాలా క్యూరియాసిటీ నెలకొంది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు మాళవిక మోహనన్ కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. నిధి అగర్వాల్, రిద్ది కుమారి తదితరులు కూడా ఈ చిత్రంలో ప్రభాస్‌తో ఆడి పాడనున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా గురించి మాళవిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన చిత్రం ”యుధ్రా” ప్రచారంలో పాల్గొన్న మాళవిక ‘రాజాసాబ్‌’ సినిమా షూటింగ్‌ గురించి అప్‌డేట్ ఇచ్చారు.

Read Also: Ashok Galla: అశోక్ గల్లా హీరోగా రొమాంటిక్‌ కామెడీ డ్రామా.. క్లాప్ కొట్టిన నమ్రత

‘రాజాసాబ్‌’ రొమాంటికి హారర్ కామెడీగా రానుందని ఆమె తెలిపారు. తాను ఈ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టబోతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఇప్పటివరకు సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూసినట్లు చెప్పారు. ఇందులో తన పాత్రకు ప్రాధాన్యం ఉందని, ఇలాంటి సినిమాలో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. పూర్తి ఎంటర్‌టైనర్‌గా ఇది ముస్తాబవుతోందని మాళవిక పేర్కొన్నారు. ప్రస్తుతం సగం షూటింగ్ పూర్తి అయినట్లు మాళవిక సినిమా షూటింగ్ గురించి అప్‌డేట్ ఇచ్చారు. మరోవైపు స్టార్‌ హీరో ప్రభాస్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రభాస్ ఇంటి భోజనానికి ఎవరైనా ఫిదా కావాల్సిందేనన్నారు. భోజనమంటే ఏదో ఒక కర్రీ, బిర్యానీ తెప్పించడం కాదని.. ఏకంగా పెద్దపెద్ద పాత్రల్లో ఒక గ్రామానికి సరిపోయేంత ఆహారాన్ని ఏర్పాటుచేస్తాడని ప్రశంసలు కురిపించారు. ఇప్పటివరకు అలాంటి రుచికరమైన ఆహారాన్ని తినలేదని ప్రభాస్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై ‘రాజాసాబ్‌’ రానున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. మూవీ విజువల్ వండర్‌లా ఉంటుందని నిర్మాత ఓ సందర్భంలో తెలిపారు. ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాల్లో ప్రభాస్ కనిపించనున్నాడు..
రాజా సాబ్‌లోని స్టార్ కాస్ట్ గురించి చెప్పాలంటే, ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్‌లు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది అంటే 2025లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు ప్రభాస్ చేతిలో చాలా భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా యొక్క స్పిరిట్, ప్రశాంత్ నీల్ చిత్రం సలార్ రెండవ భాగంలో కనిపించనున్నాడు.