టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ప్రమోషన్ లో భాగంగా తారక్ తదుపరి సినిమాల గురించి వెల్లడిస్తున్నారు.

Also Read : Devara : దేవర సెకండ్ ట్రైలర్ ఆలస్యం.. కారణం ఏంటంటే..?

ప్రస్తుతం తారక్ చేతిలో నాలుగు ఐదు సినిమాలకు పైగానే లైనప్ లో ఉన్నాయని తెలుస్తోంది. ఒకవైపు  దేవర సినిమా  చేస్తుండగానే మరో వైపు హృతిక్ రోషన్, ఎన్టీయార్ కాంబోలో తెరకెక్కుతున్న వార్ 2 సినిమాలోనూ నటిస్తున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టనున్నాడు యంగ్ టైగర్. ఇదిలా ఉండగా ప్రముఖ కన్నడ దర్శకుడు కేజిఎఫ్ వంటి చిత్రాలు తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. వీరిద్దరి కాంబినేషన్లో రానున్న సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇటీవల దేవర ప్రమోషన్స్ లో భాగంగా తారక్ వెట్రిమాన్ తో సినిమా చేస్తానని ప్రకటించాడు. వెట్రిమారన్ కూడా తారక్ కు ఇప్పటికే కథ వినిపించానని కూడా తెలిపాడు. ఇక అలాగే మరొక తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో కూడా నటిస్తానని తెలిపాడు తారక్. ఇక టాలీవుడ్ సెన్సషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తోను ఎన్టీఆర్ మూవీ రానుందని తెలుస్తోంది.  వీటితో పాటు సంజయ్ లీల బన్సాలి దర్శకత్వంలోను ఓ సినిమా చేయనున్నాడు టైగర్.