• తిరుమల లడ్డు ప్రసాదం స్పందించిన మోహన్ బాబు
  • ఆవేదనతో లేఖ విడుదల చేసిన మంచు మోహన్ బాబు

తిరుమల లడ్డు ప్రసాదం తయారీ లో ఉపయోగించిన నెయ్యి వాడకంలో ఇటీవల పలు రకాల ఆరోపణలు వస్తున్న సంగతి, తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా  మారింది. కాగా ఈ వ్యవహారంపై టాలీవుడ్ సీనియర్ నటుడు, శ్రీ విద్యానికేతన్ సంస్థల చైర్మన్ మంచు మోహన్ బాబు స్పందించారు. ఇందుకోసమై ఓ లేఖ విడుదల చేసారు మోహన్ బాబు.

Also Read :  Pavan kalyan: OG మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్స్.. ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే..?

మోహన్ బాబు లేఖలో  ప్రస్తావిస్తూ “ప్రపంచ వ్యాప్తంగా ప్రతి హిందూ పూజించే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. ఆ దైవానికి నిత్యం సమర్పించే లడ్డూలలో కలిపే ఆవు నెయ్యిలో దాదాపు 3 నెలల క్రితం వరకు ఇతర జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయాను, తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. నిత్యం మా మోహన్ బాబు విశ్వవిద్యాలయం నుంచి కన్పించే తిరుమల క్షేత్రాన్ని చూసి నాతోపాటు వేలాదిమంది ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్ధులు, నిత్యం భక్తిపూర్వకంగా నమస్కరించుకుంటూ ఉంటాం. ఆ స్వామి దగ్గర ఇలా జరగడం ఘోరం, పాపం, ఘోరాతి ఘోరం, నికృష్టం, అతినీచం, హేయం, అరాచకం. ఇదేగాని నిజమైతే నేరస్థులను శిక్షించాలని నా ఆత్మీయుడు, నా మిత్రుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుని హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఈ కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు నా మిత్రుడు అందుకుని నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.