• పుష్ప 2 కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్
  • యూట్యూబ్ ఛానెల్స్ ఫేక్ వార్తలు రాశాయి
  • జానీ మాస్టర్ కేసుపై స్పందించిన మైత్రీ నిర్మాతలు

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోణలు నేపథ్యంలో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసినసంగతి తెలిసిన విషయమే. ఓ షో కోసం జానీ మాస్టర్ తో కలిసి ముంబైకి వెళ్ళినప్పుడు హోటల్లో తనపై అత్యాచారం చేసాడని,  మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చెసాడని నార్సింగి పోలీసులకు జానీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసే యువతి కేసు పెట్టింది. ఈ ఆరోపణలు నేపథ్యంలో జానీ మాస్టర్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే జానీ మాస్టర్ పై కేసు పెట్టిన ఆ యువతి మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న పుష్ప -2 లోని ఓ సాంగ్ కు అడిషనల్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసిన విషయం తెలిసిందే.

Also Read : Mathuvadalara2 : ఓవర్సీస్ లో డాలర్స్ వర్షం కురిపించిన MV2

ఈ వ్యవహారమై మత్తువదలరా -2 సక్సెస్ మీట్ లో  మైత్రీ నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ మాట్లాతుతూ ”  ఆ యువతీ లాంగ్ బ్యాక్ పుష్ప -2 స్టార్ట్ చేసినప్పుడే ఓక సాంగ్ కోసం వర్క్ చేసింది. గణేష్ ఆచార్య మాస్టర్ సూచించిన స్టెప్స్ టీమ్ కు వివరించేందుకు ఆయన అడిషనల్ కొరియోగ్రాఫర్ గా విజయ్, ఈ యువతీ వర్క్ చేస్తుంటారు. అలాగే పుష్ప -2 లోని అన్ని సాంగ్స్ కు వర్క్ చేస్తున్నారు, ఇంకా 2 పాటలు పెండింగ్ లో ఉన్నాయి. అక్టోబరు లో ఆ సాంగ్స్ ఇఓ షూట్ చేస్తాం, వాటికి కూడా ఆ అమ్మాయి ఉంటుంది. అలాగే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంటుంది దానికి జానీ మాస్టర్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్. కానీ ఈలోగా ఇదంతా జరిగింది. ఆ అమ్మాయి సెట్స్ లో ఉన్నపుడు బన్నీతో హాయ్ సార్ అంతవరకే ఉంటారు. కానీ కొందరు కొత్త వచ్చిన యూట్యూబ్ ఛానెల్స్ వాళ్ళ సెన్సేషన్ కోసం బన్నీ జానీ మాస్టర్ ను తప్పించి ఆ యువతికి  అండగా ఉన్నారు అని ఫేక్ న్యూస్ లు రాసారు. అల్లు అర్జున్‌కు డాన్స్ టీమ్ గురించి పెద్ద‌గా ఏం తెలీదు. బ‌న్నీ గారి స్టేచ‌ర్‌కి ఇవ‌న్నీ చాలా చిన్న విష‌యాలు. వాళ్ల మ‌ధ్య ఏం గోల ఉన్నా మాకు సంబంధం లేదు ”  అని అన్నారు.