• సెప్టెంబర్ 27న జూనియర్ ఎన్టీఆర్ దేవర

  • తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకునేలా జీవో

  • తాజాగా పెంచిన రేట్లు ఎంతంటే

Devara: జూనియర్ ఎన్టీఆర్ హీరోని నటించిన దేవర సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లు పెంచుతూ అక్కడి ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక జీవో జారీ చేసింది. మొదటి రోజు భారీగా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వం రెండు నుంచి పదో రోజు వరకు మరో రేటు అమ్ముకునేలా అవకాశం కల్పించింది. ఇక పెంచిన టికెట్ రేట్ల ప్రకారం మొదటి రోజు సింగిల్ స్క్రీన్సు 295 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో 413 రూపాయలు అమ్ముకోవచ్చు. ఇక సింగిల్ స్క్రీన్స్ లో రెండో రోజు నుంచి పదవ రోజు వరకు 206.5 పైసలు మల్టీప్లెక్స్ లలో రెండవ రోజు నుంచి పదవ రోజు వరకు 354 పెంచి అమ్ముకునేలా అవకాశం కలిపిస్తూ జీవో జారీ చేశారు.

Also Read: Oscars: కల్కి 2898 ఏడీ-హనుమాన్ సహా ఆస్కార్ అఫీషియల్ ఎంట్రీకి పోటీ పడిన 29 సినిమాలివే!

అంతే కాదు మొదటి రోజు మిడ్ నైట్ షోస్ కూడా అనుమతి ఇస్తూ జీవోలో ప్రకటన ఇచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సాధారణంగా రోజుకి నాలుగు షోస్ ఉంటాయి. కానీ మొదటి రోజు ఒక్కొక్క స్క్రీన్ లో ఏడు షోస్ వేసుకునేలా అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా పాత్రలో నటించాడు. ఇక కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నిర్మిస్తుండగా కళ్యాణ్ రామ్ బావమరిది కొసరాజు హరికృష్ణ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని సహ నిర్మిస్తున్నారు. సుమారు 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ వస్తుండడంతో ఈ సినిమా మీద ఎన్టీఆర్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.