• గ్రాండ్ గా సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్
  • కార్తీ అరవింద్ స్వామి కాంబోలో వస్తున్న సత్యం సుందరం
  • సెప్టెంబరు 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్

హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సత్యం సుందరం’. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు

సత్యం సుందరం సినిమా ప్రమోషన్ ఈవెంట్లో మీమ్స్ గురించి మాట్లాడే సందర్భంలో యాంకర్ కార్తిని లడ్డు కావాలా నాయన.. మరో లడ్డు కావాలా అని సరదాగా ప్రశ్నించగా కార్తీ బదులిస్తూ ” ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడొద్దు, సెన్సిటివ్ టాపిక్ అది, మనకి వద్దు లడ్డు, అసలు లడ్డు టాపిక్ వద్దు’ అని నవ్వుతూ బదులిచ్చాడు. ఇటీవల లడ్డు పై వివాదాలు నడుస్తున్న తరుణంలో కార్తీ లడ్డు మీమ్ ను స్కిప్ చేసేశాడనికి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా సత్యంసుందర మంచి హ్యుమర్ వున్న హార్ట్ వార్మింగ్ మూవీ. ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా. ఫ్యామిలీతో కలసి చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు, నేను అరవింద్ స్వామి.. మా ఇద్దరిలో ఎవరు లేకపోయినా ఈ సినిమా లేదు, ఒక చిన్నపల్లెటూరిలో శారీ షాప్ నడిపే వాడిగా సింపుల్ అండ్ బ్యూటీఫుల్ క్యారెక్టర్ ఈ సినిమాలో చేస్తున్నాను అని కార్తీ అన్నారు

Also Read : Jr NTR : దేవర RTCక్రాస్ రోడ్ ‘ఆల్ టైమ్ రికార్డ్’.. ప్రభాస్, మహేష్ రికార్డ్స్ గల్లంతు