బాహుబలితో రీజినల్ బౌండరీస్ చెరిపేసిన జక్కన్న.. మన సినిమాను ఇండియన్ సినిమా అనే స్థాయికి తీసుకువచ్చారు. ఇప్పుడు కల్కి 2898 ఏడీతో ఇండియన్ సినిమాను గ్లోబల్ రేంజ్కు చేర్చారు నాగ్ అశ్విన్. అంతేకాదు, ఇండియన్ కనుమరుగవుతున్న మల్టీస్టారర్లకు కొత్త బూస్ట్ ఇస్తున్నారు ఈ యంగ్ మేకర్.
ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నాగ్ అశ్విన్, ఆ సినిమాలో నాని, విజయ్ దేవరకొండను లీడ్ రోల్స్లో చూపించారు. ఇదే సినిమాలో సీనియర్ స్టార్ కృష్ణంరాజును ఓ కీలక పాత్రకు ఒప్పించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తరువాత చేసిన మహానటి కోసం కూడా బిగ్ స్టార్స్ను ఒక ఫ్రేమ్లోకి తీసుకువచ్చారు నాగీ. నాగచైతన్య, మోహన్బాబు లాంటి వాళ్లు కేవలం నాగీ మీద నమ్మకంతోనే ఆ సినిమాలో గెస్ట్ రోల్స్ చేశారు.
తాజాగా కల్కి 2898 ఏడీ కోసం అంతకు మించిన బిగ్ స్టార్స్ను ఓకే ఫ్రేమ్లోకి తీసుకువచ్చారు. కథను నడిపించే కీలక పాత్రల్లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకోన్ లాంటి లెజెండ్స్ నటించారు. దీంతో ఈ సినిమా మీద బజ్ స్కై హైకి చేరింది.
సినిమా కథను మలుపు తిప్పే పాత్రల్లో యంగ్ హీరో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ సర్ప్రైజ్ చేశారు. వీళ్లే కాదు దర్శకులు రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, లాంటి వాళ్లు కూడా నాగీ మీద ప్రేమతో గెస్ట్ రోల్స్కు ఓకే చెప్పారు.
ఒకే టైమ్లో దర్శకులుగా ఉన్న వారి మధ్య కాంపిటీషనే ఎక్కువగా కనిపిస్తోంది. కానీ నాగీ విషయంలో మాత్రం ఈ ఫార్ములా పూర్తిగా మారిపోయింది. తన కాంటెంపరరీ దర్శకులంతా నాగీ వర్క్ను భేష్ అంటున్నారు. అతని కోసం తన వంతు సాయం చేస్తున్నారు. తన విజన్కు నెవ్వర్ బిఫోర్ రేంజ్ స్టార్ పవర్ను కూడా జోడించి ఇండియన్ సినిమాను గ్లోబల్ రేంజ్కు చేర్చటంలో సక్సెస్ అయిన నాగ్ అశ్విన్, ఇండియన్ ఇండస్ట్రీలో మరో పాన్ ఇండియా మేకర్గా ఎమర్జ్ అయ్యారు.