• సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కానున్న దేవర
  • భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్
  • మరోసారి ప్రభుత్వానికి దరఖాస్తు చేసిన నిర్మాతలు

నందమూరి తారక రామారావు, జాన్వీ కపూర్ జోడిగా నటిస్తున్న చిత్రం దేవర. మరో రెండు రోజుల్లో ఈ సినిమా థియేటర్లలో దిగబోతోంది. ఇప్పటికే ఆన్ లైన్ బుకింగ్స్ స్టార్ట్ చేసారు. బుకింగ్స్ ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాయి. ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అధిక ధరలకు టికెట్స్ అమ్ముకునేలాగా ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. తెలంగాణలో మొదటి రోజు ముల్టీప్లెక్స్ లో రూ. 413 రెండవ రోజు నుండి రూ. 354, ఇక సింగిల్ స్క్రీన్స్ లో రూ. 295, రెండవ రోజు నుండి రూ. 206.5 ఉండేలా అలాగే మొదటి రోజు 7 షోలు ప్రదర్శించేలా అనుమతులు పొందారు మేకర్స్.

అటు ఆంధ్రాలోను మల్టిప్లెక్స్ లో రూ. 135, సింగిల్ స్క్రీన్స్ లో రూ. 100 టికెట్స్ ధరలు పెంచుతూ జిఓ విడుదల చేసారు అధికారులు. కాగా తెలంగాణ ప్రభుత్వానికి దేవర నిర్మాతలు మరోసారి దరఖాస్తు చేసుకున్నారు. రెండో రోజు నుంచి ఇచ్చిన రేట్లు చాలవని, పెంచమని మళ్లీ ప్రభుత్వాన్ని కోరారు. నిర్మాతలు. దాదాపు అనుకూలంగా జీఓ వచ్చే వీలుంది. హైదరాబాద్ సిటీ మల్టీ ప్లెక్స్ లు అన్నింటిలో పది రోజుల పాటు రూ. 100 రూపాయల అదనపు పెంపు ఉందనున్నట్టు తెలుస్తోంది. సింగిల్ స్క్రీన్ లు మాత్రం మొదటి రోజు మాత్రం 100 రూపాయల అదనపు పెంపు వుంటుంది. ఒంటి గంట స్పెషల్ షోలకు ప్రభుత్వం నుంచి వేరే రేట్ లేదు అవి ఫ్యాన్స్ షోలు కాబట్టి వారికి నచ్చినట్టు వారు అమ్ముతున్నారు. ప్రస్తుతం బుకింగ్స్ ట్రెండ్స్ మాత్రం అన్ని ఏరియాలలో భారీ ఎత్తున జరుగుతున్నాయి.