News July 2, 2024

సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో మిగిలిన సీట్లను ఈ నెల 4న భర్తీ చేస్తామని జిల్లా సమన్వయకర్త వెంకట్రావు తెలిపారు. ఉదయం 10 గంటలకు స్పాట్ అడ్మిషన్ లాటరీ పద్ధతి ద్వారా ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో మిగిలిన సీట్లు భర్తీ చేస్తారని, ఆసక్తి కలిగిన విద్యార్థులు వారికి అనువుగా ఉండే పాఠశాలకు వెళ్లి దరఖాస్తు చేయాలన్నారు. ➠ SHARE IT..