News June 27, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాలుగేళ్ల కాలంలో కొత్తగా 12 డీసీసీబీ బ్యాంకులను ఏర్పాటు చేశామని డీసీసీబీ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు తెలిపారు. కురవి, మొగుళ్లపల్లి, దేవరుప్పుల, రఘునాథపల్లి, సంగెం, హసన్పర్తి, మంగపేట, గీసుగొండ, నర్సింహులపేట, బచ్చన్నపేట, నెల్లికుదురు తదితర 11 ఏరియాల్లో నూతన బ్యాంకుల ఏర్పాటుకు ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపామని చెప్పారు.