News June 27, 2024

మంచిర్యాలలోని మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఈ నెల 27 నుంచి 30 వరకు జరగనున్న రాష్ట్రస్థాయి సీనియర్స్ బ్యాడ్మింటన్ పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ యువీఎన్ బాబు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్లూరు సుధాకర్, టోర్నమెంట్ మ్యాచ్ కంట్రోలర్ కుమార్, జిల్లా కోశాధికారి సత్యపాల్ రెడ్డి, తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు.