News June 27, 2024

డెన్మార్క్‌లో ఆవులు, గొర్రెలు, పందులను పెంచుతూ జీవనం సాగించే వారికి ఆ దేశ ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. 2030 నుంచి కార్బన్ ట్యాక్స్ విధించేందుకు ప్లాన్ చేస్తోంది. హానికరమైన కార్బన్, మీథేన్ వంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్‌ కట్టడికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది అమలులోకి వస్తే టన్ను కార్బన్‌డయాక్సైడ్‌కు 120 క్రోనర్ల (₹1430)తో ప్రారంభమై 2035 నాటికి 300 క్రోనర్ల (₹3500) వరకు చెల్లించాల్సి వస్తుంది.