
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) మ్యాచ్లు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. అయితే, ఇటీవల జరిగిన పంజాబ్ డి షేర్ మరియు కర్ణాటక బుల్డోజర్స్ మధ్య మ్యాచ్లో ఒక వివాదం చోటుచేసుకుంది. ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరగడంతో మైదానం వేడెక్కింది. పంజాబ్ తరఫున బ్యాటింగ్ చేస్తున్న నింజా ఎన్జే మరియు కర్ణాటక కీపర్ కిచ్చా సుదీప్ మధ్య మాటల యుద్ధం జరిగింది.
ఈ వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో అంపైర్లు జోక్యం చేసుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కర్ణాటక ఆటగాళ్లు నింజా ఎన్జేను చుట్టుముట్టడంతో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. అంపైర్లు మళ్లీ కలుగజేసుకుని ఆటగాళ్లను శాంతింపజేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మ్యాచ్ అనంతరం కిచ్చా సుదీప్ స్వయంగా నింజా ఎన్జేతో చేతులు కలిపి రాజీ కుదుర్చుకున్నారు. ఇరువురు ఆటగాళ్లు చిరునవ్వుతో మాట్లాడుకున్నారు. అలాగే పంజాబ్ జట్టులోని ఇతర ఆటగాళ్లతో కూడా సుదీప్ కరచాలనం చేశారు. ఈ సంఘటన క్రీడాస్ఫూర్తిని చాటిచెప్పింది.
ఇక తెలుగు వారియర్స్ జట్టు విషయానికి వస్తే, ఈ టోర్నమెంట్లో ఆ జట్టు పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. మూడు మ్యాచ్లలో కేవలం ఒక మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. సెమీఫైనల్స్కు చేరుకోవాలంటే బెంగాల్ టైగర్స్తో జరిగే మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాలి.