
టాలీవుడ్ కమెడియన్ పృథ్వీ రాజ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి ఆయన ట్విట్టర్ (X)లోకి అధికారికంగా ప్రవేశించారు. ఇటీవల లైలా మూవీ ఫెయిల్యూర్ తర్వాత క్షమాపణలు చెప్పినా ప్రయోజనం లేకపోయింది. వివాదం తగ్గుతున్న తరుణంలో “30 ఇయర్స్ ఇండస్ట్రీ స్టార్” అంటూ తన మొదటి ట్వీట్ ద్వారా అభిమానులకు హాయ్ చెప్పారు.
ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవ్వడంతో పృథ్వీ రాజ్ మరోసారి ట్రెండింగ్లోకి వచ్చాడు. ఆయన “స్టేజ్ మీద వ్యక్తీకరించాలనుకుంటే కొందరికి బాధగా ఉంది, అందుకే ట్విట్టర్లో భావాలను స్వేచ్ఛగా పంచుకుంటా” అని ప్రకటించారు. ఆసక్తికరంగా, ఆయన ప్రొఫైల్ పిక్ తనదే పెట్టి, కవర్ ఫొటోగా మెగా ఫ్యామిలీ ఫొటోను ఎంపిక చేశారు, ఇది నెటిజన్లలో చర్చకు దారితీసింది.
లైలా సినిమా ఫెయిల్యూర్ తర్వాత క్షమాపణ చెప్పినా, ఆయనపై ఉన్న విమర్శలు పూర్తిగా తగ్గలేదు. ఇప్పుడు ట్విట్టర్ ఎంట్రీతో మళ్లీ వివాదాలు రాజుకుంటున్నాయి. కొందరు ఆయన ధైర్యాన్ని మెచ్చుకుంటుండగా, మరికొందరు “సోషల్ మీడియాలో ఇది సరైన అడుగా?” అని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటివరకు పృథ్వీ ట్విట్టర్లో చురుకుగా ఉంటూ తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అయితే, ఆయన నిజంగానే కొత్తగా మారతారా? లేక మరిన్ని కాంట్రవర్సీలకు తెర తీస్తారా? అనేది చూడాలి.