News June 27, 2024

గిరిజన గ్రామాలకు ఫీడర్ అంబులెన్సులు ఏర్పాటు చేస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. గిరిజనుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాలలో మందులు అందుబాటులో ఉండేలా పూర్తి చర్యలు చేపట్టాలని సూచించారు. పీహెచ్సీ వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.