హీరో రాజ్ తరుణ్ (Raj tarun) తనను మోసం చేశాడంటూ హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది లావణ్య (Lavanya) అనే యువతి. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకున్నాడని, కొన్నేళ్లుగా కలిసి ఉన్నాడని ఆమె కేసులో పేర్కొంది. ఇప్పుడు మరో హీరోయిన్ తో సంబంధం పెట్టుకుని తనను వదిలేశాడని లావణ్య కంప్లైంట్ లో వెల్లడించింది. లావణ్య కేసు పెట్టడంతో మీడియా రాజ్ తరుణ్ ను రెస్పాన్స్ కోరింది. తనపై లావణ్య పెట్టిన ఈ కేసుపై స్పందించారు రాజ్ తరుణ్.

రాజ్ తరుణ్ మాట్లాడుతూ – ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో లావణ్య నాకు పరిచయం. ఆమెతో కొన్నాళ్లు కలిసి ఉన్నా. కానీ లావణ్య వ్యవహార శైలి నచ్చక దూరంగా ఉంటున్నా. ఆమే కాదు ఆమె చుట్టూ ఉన్న వారంతా చెత్తనే. ఆమె నాకు మొదట్లో కొంత సాయం చేసింది. లావణ్యపై నాకు ఆ కృతజ్ఞత ఉండేది. చాలాసార్లు నా దగ్గర డబ్బులు తీసుకుంది. లావణ్యకు డ్రగ్స్ సహా అన్ని అలవాట్లూ ఉన్నాయి. ప్రస్తుతం మరో వ్యక్తితో తాను కలిసి ఉంటోంది. లావణ్య వల్ల నా కెరీర్ చెడిపోవద్దని ఏమీ మాట్లాడకుండా ఉంటున్నా. ఇప్పుడు నాపై కేసు పెట్టింది కాబట్టి లీగల్ గానే ఎదుర్కొంటా. అని అన్నారు.