లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీతోపాటు కమల్ హాసన్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం మరో సినిమా చేస్తున్నాడు. నాయకుడు సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమా థగ్ లైఫ్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ఆసక్తిని కలిగించాయి. ఈ చిత్రంలో శింబు, త్రిష, అభిరామి, వాయపురి కీలకపాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాలో జయం రవి, దుల్కర్ సల్మాన్ నటిస్తున్నట్లు టాక్ వినిపించింది. కానీ వారిద్దరు కాకుండా బాలీవుడ్ నటులు అలీ ఫజల్, రోహిత్ సరాఫ్, పంకజ్ త్రిపాఠిలను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే మణిరత్నం వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా..? ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరలవుతుంది.

మణిరత్నం వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న అమ్మాయి అలీషా రహమాన్. ఈ అమ్మాయి మరెవరో కాదు.. ఒకప్పటి హీరో, టాలీవుడ్ నటుడు రహమాన్. తండ్రిలాగే తనకు కూడా సినిమాలంటే ఆసక్తి. దర్శకత్వం పై ఇష్టమున్న తన కూతురిని సినిమా గురించి తెలుసుకోవడానికి.. డైరెక్షన్ నేర్చుకునేందుకు మణిరత్నం దగ్గర అసిస్టెంట్‌గా పంపించాడు. ప్రస్తుతం అలీషా థగ్ లైఫ్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తుంది. ఈ మూవీ తర్వాత అలిషా దర్శకురాలిగా మారే ఛాన్స్ ఉందని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.