బాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో జెనీలియా డిసౌజా- రితేశ్ దేశ్‌ముఖ్ జోడీ కూడా ఒకటి. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తమ ప్రేమ బంధానికి ప్రతీకగా ఇద్దరు పిల్లలను కూడా తమ జీవితంలోకి ఆహ్వానించారు. అటు ప్రొఫెషనల్ లైఫ్ లోనూ, ఇటు పర్సనల్ లైఫ్ పరంగానూ ఎంతో హ్యాపీగా ఉంటున్నారీ లవ్లీ కపుల్. ఇప్పుడీ సెలబ్రిటీ జంట అవయవ దానం ప్రకటించారు. ఇందుకు గాను ఆ దంపతులకు నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ కృతజ్ఞతలు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను రితేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా అవయవ దానానికి బతికి ఉన్నప్పుడే అంగీకార సంతకం చేయాలి. ఈ విధంగా సంతకం చేసిన వ్యక్తి మరణించిన తర్వాత కళ్లు వంటి అవయవాలు లభిస్తాయి. ఇవి అవసరమైన వ్యక్తులకు ఇవ్వచ్చు. రితేష్, జెనీలియా దంపతులు కూడా ఇప్పుడు ఇదే నిర్ణయం తీసుకున్నారు.

కాగా గతంలోనే అవయవ దానం చేస్తామని జెనీలియా, రితేశ్ దంపతులు ప్రకటించారు. ఇప్పుడు దంపతూలిద్దరూ మరోసారి అవయవదానంపై ప్రతిజ్ఞ చేశారు. కాగా జెనీలియా, రితేశ్ లకు సంబంధించిన వీడియోను నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ షేర్ చేసింది. ‘రితేష్‌, జెనీలియాకు ధన్యవాదాలు . అవయవాలు దానం చేస్తానని ప్రమాణం చేశారు. వీరి నిర్ణయం ఎందరికో స్ఫూర్తిగా నిలవాలి’ అని బాలీవుడ్ లవ్లీ కపుల్ పై ప్రశంసల వర్షం కురిపించింది.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికి వస్తే.. సోనాక్షి సిన్హా, షకీబ్ సలీమ్‌లతో కలిసి రితేష్ ‘కాకుడ’ చిత్రంలో నటిస్తున్నారు. ఆదిత్య సర్పోథర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 12న సినిమా విడుదల కానుంది. మరోవైపు గతంలో తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో స్టార్ హీరోలతో ఆడి పాడిన జెనీలియా కూడా రీ ఎంట్రీకి సిద్ధమైంది. త్వరలోనే ఓ తెలుగు సినిమాలో ఆమె నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.