తెలుగు కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆహా మరో సూపర్ హిట్ సినిమాతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇప్పటికే రకరకాల గేమ్ షోస్, ఆకట్టుకునే టాక్ షోలతో అలరిస్తున్న ఆహా తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూలై 10న యారో సినిమాస్ తాజా బ్లాక్ బస్టర్  “విందు భోజనం”  రీసెంట్ గా ఆహా OTT ప్లాట్‌ఫామ్‌లో విడుదల అయ్యింది. విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రంకి మంది ప్రశంసలను అలాగే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను వస్తుంది. కార్తీక్.ఎస్ దర్శకత్వం వహించిన “విందు భోజనం”, చాలా మంది నటించారు.. అదేవిధంగా  ఒక ప్రత్యేకమైన సినిమా అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమాలోని ఆకర్షణీయమైన కథాంశం, అద్భుతమైన ప్రదర్శనలు, ఆకట్టుకునే విజువల్స్‌తో తెలుగు సినిమా వీక్షకులను ఆకర్షించింది.

ఈ చిత్రంలో అఖిల్ రాజ్, ఐశ్వర్య హోలక్కల్, సిద్ధార్థ్ గొల్లపూడి, అభిషేక్ బొడ్డేపల్లి, హర్ష వర్ధన్, అనిత చౌదరి, కేశవ్ దీపక్, అశ్రిత వేముగంటి, మురళీకృష్ణ, బాల ,వీరబధ్రమ్ నటించి మెప్పించారు. అలాగే ఈ సినిమాకు అజయ్, దేవ్ దీప్ కుందు సినిమాటోగ్రఫీ అందించారు.

‘విందు భోజనం’కు ఆహాలో వచ్చిన ఉత్సాహభరితమైన స్పందన చూసి మేము సంతోషిస్తున్నాము” అని ఆరో అడ్వర్టైజింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు , మేనేజింగ్ డైరెక్టర్, యారో సినిమాస్ బ్యానర్‌లో విడుదల ఐన ‘విందు భోజనం’ నిర్మాత బూసం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. “ఈ చిత్రం అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకునే హై-క్వాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుందన్న నమ్మకం మాకందరికీ ఉంది అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.