ఒకప్పుడు రాణించిన ముద్దుగుమ్మల్లో ఖుష్బూ ఒకరు. తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఖుష్బూ. వెంకటేష్ హీరోగా నటించిన కలియుగపాండవులు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు ఖుష్బూ. `కెప్టెన్ నాగార్జున`, `త్రిమూర్తులు`, `భరతంలో అర్జునుడు`, `కిరాయి దాదా`, `జీవన జ్యోతి`, `శాంతి క్రాంతి`, `పేకాట పాపారావు` ఇలా చాలా సినిమాల్లో నటించి మెప్పించారు ఆమె. ఆతర్వాత చిరంజీవి స్టాలిన్  సినిమాలో మెగాస్టార్ సిస్టర్ గా కనిపించారు. అలాగే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాలో పవన్ కళ్యాణ్ తల్లి పాత్రలో కనిపించారు.

ఇక ఇప్పుడు పలు టీవీ షోలోకు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే రాజకీయాల్లోనూ ఖుష్బూ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు ఈ సీనియర్ హీరోయిన్. తాజాగా జబర్దస్త్ షోలో ఆమె తన ప్రేమ విషయాలను బయటపెట్టింది. తన భర్త సుందర్ తనకు ఎలా ప్రపోజ్ చేశాడో తేలింది ఖుష్బూ. ఈ స్టార్ హీరోయిన్ భర్త సుందర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఆతర్వాత `మురై మామన్‌` మూవీతో  దర్శకుడిగా మారాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా సౌందర్యను అనుకున్నారట. ఆమెతో సినిమా చేయాలనీ అనుకున్నాడట సుందర్. అయితే ఆమె అప్పటికే స్టార్ హీరోయిన్ కావడంతో ఆమె సినిమాలో నటిస్తుందో లేదో అని వెనక్కి తగ్గాడట. ఆతర్వాత మీనాను అనుకున్నారట. కానీ ఆమె డేట్స్ అడ్జెస్ట్ అవ్వకపోవడంతో మూడో ఛాయిస్ గా ఖుష్బూని ఎంపిక చేశారట.

అయితే ఈ సినిమా సమయంలోనే ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే సుందర్ కు, ఖుష్బూకి మధ్య కెమెరామెన్‌ మీడియాటర్ గా ఉండేవాడట.. అయితే అది చూసి చాలా మంది.  కెమెరామెన్‌తో ఖుష్బూ లవ్‌లో ఉందని అనుకున్నారట. ఓ రోజు సుందర్ వచ్చి.. మనం పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలు నీలా ఉంటారా? నాలా ఉంటారా అన్నాడట. దాంతో ఆమె షాక్ అయ్యిందట. దాంతో మరో మాట మాట్లాడకుండా వెంటనే ఎస్ చెప్పిందట ఖుష్బూ.. ఒక వేళ సౌందర్యకాని మీనా కానీ ఆ సినిమా చేసి ఉంటే ఖుష్బూ లైఫ్ లో సుందర్ ఉండేవాడు కాదు అని అంటున్నారు కొందరు నెటిజన్స్.

 

View this post on Instagram

 

A post shared by Kushboo Sundar (@khushsundar)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.