సినీ రంగుల ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న అమ్మాయి. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదట్లో బ్యాగ్రౌండ్ డ్యాన్సర్.. ఆ తర్వాత బుల్లితెరపై పలు సీరియల్లలో చిన్న చిన్న పాత్రలు పోషించింది. కానీ ఆ తర్వాత ఊహించని విధంగా ఇండస్ట్రీలో సెన్సెషన్ అయ్యింది. టీవీ నుంచి ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ నటిగా ఫేమస్ అయ్యింది. కేవలం ఒకే ఒక్క సీరియల్ ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. సర్జరీకి ముందు బొద్దుగా కనిపించిన అమ్మాయి.. ఆ తర్వాత సన్నజాజి తీగల.. అసలు ఊహించని విధంగా మారిపోయింది. ఈ బ్యూటీకి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ అమ్మడు నెట్టింట చేసే అందాల ఆరబోత గురించి చెప్పక్కర్లేదు. మోడ్రన్ డ్రెస్సులతో గ్లామర్ షోతో నెట్టింట రచ్చ చేస్తుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా.. తనే బాలీవుడ్ బుల్లితెర నటి మౌనీ రాయ్.

నాగిని సీరియల్ ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ కెరీర్ మొదట్లో బ్యాగ్రౌండ్ డ్యాన్సర్. అభిషేక్ బచ్చన్, భూమికా చావ్లా నటించిన రన్ చిత్రం పాటలో మౌని రాయ్‌ మొదట డాన్సర్‌గా కనిపించింది. టీవీ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన ఈ నటి తక్కువ సమయంలోనే విజయాన్ని అందుకుంది. నటన మాత్రమే కాదు మౌని తన డ్యాన్స్‌తో అభిమానులను కూడా పిచ్చెక్కిస్తుంది. నాగిన్ సీరియల్ తర్వాత పలు సీరియల్స్ చేసింది. అలాగే ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది.

నాగిన్ తర్వాత ఏక్తా కపూర్ షో ‘క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ’లో కృష్ణ తులసి పాత్రను పోషించింది. అక్షయ్ కుమార్ నటించిన ‘గోల్డ్’ చిత్రంతో మౌని రాయ్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. కెరీర్ మొదట్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. కానీ నాగిన్ సీరియల్ తర్వాత ఆమె వెనుదిరిగి చూడలేదు. ఇటీవల విడుదలైన జలీమా పాటలో నటించింది. ప్రస్తుతం మౌనీ రాయ్ వయసు 38 సంవత్సరాలు. ఇక సోషల్ మీడియాలో నిత్యం క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.