లావణ్య(Lavanya)తో ప్రేమ వ్యవహారం హీరో రాజ్ తరుణ్ (Raj tarun) మెడకు చుట్టుకుంటోంది. రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య, తిరగబడరా సామీ సినిమా హీరోయిన్ మాల్వీ మల్హోత్రా (malvi malhotra) పరస్పరం కేసులు పెట్టుకున్నారు. ఒకరి మీద మరొకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నారు. ఇప్పుడీ కేసుల విషయం రాజ్ తరుణ్ దాకా వచ్చింది. ఈ రోజు అతని మీద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు.

అతని ప్రేయసి లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు పెట్టారు. త్వరలోనే రాజ్ తరుణ్ కు నోటీసులు జారీ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని, అబార్షన్ చేయించాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఫిర్యాదుకు ఆధారాలుగా ఫోన్ స్క్రీన్ షాట్స్, ఫొటోస్ చూపించింది. లావణ్య సమర్పించిన ఆధారాల ప్రకారం రాజు తరుణ్ పై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.