టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘దేవర’ ఒకటి. RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆచార్య పరాజయం తర్వాత దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని హిట్ చేయాలనే ఉద్దేశ్యం తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా విడుదల కు మాత్రం నోచుకోవట్లేదు. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు, వీడియోలు సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి.

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాతో తెలుగు తెరను అలరించనుంది. ఎన్టీఆర్, జాన్వీ జోడీ తొలిసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. బిటౌన్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. తాజాగా దేవర సినిమా గురించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ హల్ చల్ చేస్తోంది.  ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దేవర సినిమాలోని పవర్ ఫుల్ డైలాగ్స్ లీక్ అయ్యాయి. “నీకు సాదాసీదా మనిషి కావాలా.. ఈ ఊరుని మెప్పించే నాయకుడు కావాలా?” ఈ డైలాగ్ వింటే థియేటర్లు దద్దరిల్లేలా కనిపిస్తున్నాయి.

అంతేకాకుండా దర్శకుడు కొరటాల శివ ఈసారి తారక్ ను కొత్త కోణం లో అభిమానులకు అందించనున్నారు. సెప్టెంబర్ 27న సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు హిందీలో వార్ 2 చిత్రంలో కూడా తారక్ నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న చిత్రంలో తారక్ ప్రధాన పాత్రలో నటించనున్నాడు. అలాగే  ‘కేజీఎఫ్’ సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ ఓ ప్రాజెక్ట్‌ను చేయనున్నాడు. విడుదలైన పోస్టర్లు సినిమాపై మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి.