ప్రస్తుతం సోషల్ మీడియాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రోబ్యాక్ వీడియో తెగ వైరలవుతుంది. ఆ వీడియోలో కిక్కిరిసిన జనం ముందు ఒక అమ్మాయి ఆత్మవిశ్వాసంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆవేశపూరిత ప్రసంగం చేస్తూ కనిపించింది. గంభీరమైన గొంతు.. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో స్పీచ్ అదరగొట్టేసిన ఆ అమ్మాయిని చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. నటుడు కమల్ హాసన్ కూడా వేదికపై కూర్చుని అమ్మాయి ప్రసంగాన్ని వింటున్నాడు. ఎందుకంటే ఆమె ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. కోట్లాది అభిమానులు ఉన్న ఆ తార.. తెలుగు, తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు లక్షలాది మంది ప్రేక్షకులు అభిమానించే తార. అలాగే భారతీయ సినిమాలోని ఓ స్టార్ హీరో కూతురు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారా..? తనే హీరోయిన్ శ్రుతిహాసన్.

లోకనాయకుడు కమల్ హాసన్, సారికల దంపతుల పెద్ద కూతురు శ్రుతి హాసన్. ఆరేళ్ల వయసులో ‘తేవర్ మకాన్’ సినిమాతో గాయనిగా తెరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ. కమల్ హాసన్ నటించిన ‘హే రామ్’ చిత్రంలో కూడా శృతి బాలతారగా నటించింది. చెన్నైలో పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, శృతి తన ఉన్నత చదువుల కోసం ముంబైకి వెళ్లింది. అక్కడే సెయింట్ ఆండ్రూస్ కళాశాల నుండి సైకాలజీ కంప్లీట్ చేసింది. యునైటెడ్ స్టేట్స్‌లో సంగీతాన్ని నేర్చుకుంది. ‘లక్’ అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది.

ఇక తెలుగు, తమిళంలో అనగనగా ఓ ధీరుడు సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. మొదటి సినిమా ప్లాప్ కావడంతో ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ అవేం పట్టించుకోకుండా తన నటనతో నేడు ప్రశంసలు అందుకుంటుంది. చివరగా ప్రభాస్ నటించిన సలార్ చిత్రంలో కనిపించింది. త్వరలోనే సలార్ 2 మూవీతో అడియన్స్ ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.