టాలీవుడ్లో అక్కినేని నాగచైతన్యకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జోష్ (Josh) సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చైతూ, వరుసగా విభిన్న కథలతో ప్రేక్షకులను మెప్పించాడు. తాజాగా విడుదలైన తండేల్ (Thandel) సినిమా ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచింది. 100 కోట్లకుపైగా వసూళ్లు సాధించి, చైతూ బెస్ట్ బాక్సాఫీస్ హిట్గా నిలిచింది. ఈ సినిమాకు డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఇందులో చైతూ సరసన సాయి పల్లవి నటించింది.
ఇప్పుడు చైతూ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ను విరూపాక్ష (Virupaksha) డైరెక్టర్ కార్తిక్ దండుతో చేస్తున్నాడు. రెండు సంవత్సరాల క్రితం విడుదలైన విరూపాక్ష పెద్ద విజయాన్ని సాధించడంతో ఈ కాంబినేషన్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాలో చైతూ సరసన నటించబోయే హీరోయిన్ గురించి ఫిల్మ్ సర్కిల్స్లో హాట్ టాక్ నడుస్తోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్తో దూసుకెళ్తున్న మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) ఈ చిత్రంలో హీరోయిన్గా ఎంపికైనట్లు సమాచారం. ఈమె గతంలో ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి, హిట్ 2, గుంటూరు కారం సినిమాల్లో మంచి గుర్తింపు పొందింది.
ఈ క్రేజీ కాంబినేషన్పై అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానుంది. టాలీవుడ్లో మరో బిగ్ హిట్ నమోదయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.