మణిరత్నం పేరు వినగానే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది. 1989లో నాగార్జునతో తెరకెక్కించిన “గీతాంజలి” తర్వాత ఆయన మరోసారి తెలుగులో పూర్తి స్థాయి డైరెక్షన్ చేయలేదు. అప్పటి నుండి మణిరత్నం తెరకెక్కించిన చిత్రాలు ఎక్కువగా హిందీ, తమిళ భాషల్లో విడుదలయ్యాయి. అయితే ఆయన సినిమాలు తెలుగు ప్రేక్షకులకు డబ్బింగ్ రూపంలో మాత్రమే అందాయి. రోజా, బొంబాయి, దిల్ సే, యువ, గురు లాంటి సినిమాలు తెలుగులో మంచి ఆదరణ పొందాయి కానీ, ఒరిజినల్ తెలుగు చిత్రం మాత్రం రాలేదు.
ఇటీవల ఆయన రూపొందించిన పొన్నియన్ సెల్వన్ రెండు భాగాలు భారీ విజయాలు సాధించాయి. దీంతో మణిరత్నం మళ్లీ ఫుల్ ఫాంలోకి వచ్చారని సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రస్తుతం కమల్ హాసన్తో “తగ్ లైఫ్” అనే గ్యాంగ్ స్టర్ డ్రామాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా జూన్ 5న విడుదల కానుంది. కమల్ హాసన్తో “నాయకుడు” తర్వాత మణిరత్నం చేస్తున్న ఇది రెండో సినిమా కావడం విశేషం.
తాజాగా ఫిల్మ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోన్న వార్త ప్రకారం, తగ్ లైఫ్ తర్వాత మణిరత్నం ఒక తెలుగు హీరోతో లవ్ స్టోరీ (Love Story) చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ హీరో మరెవరో కాదు.. “జాతిరత్నాలు” ఫేమ్ నవీన్ పోలిశెట్టి. ఈ కాంబినేషన్ అనౌన్స్ అయితే, అది నవీన్ కెరీర్లో టర్నింగ్ పాయింట్ అవుతుంది. మణిరత్నం వంటి లెజెండరీ డైరెక్టర్ చేతిలో అవకాశమంటే అది ఎంత విలువైనదో చెప్పాల్సిన పని లేదు.
ఇప్పటికే నాని, రామ్, నాగచైతన్య వంటి స్టార్ హీరోలు మణిరత్నంతో సినిమా చేయాలని అనుకుంటున్నారు. అలాంటప్పుడు నవీన్ పోలిశెట్టికి అవకాశం రావడం నిజంగా ఓ bumper offer. మణిరత్నం తెలుగులో మళ్లీ ఓ ప్రేమకథ (romantic drama) చెయ్యడం, అది యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోతో జరగడం అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనడం ఖాయం. ఇక అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.