
సినిమా కథలు ఒకరి నుంచి మరొకరి దగ్గరకు మారడం ఫిల్మ్ ఇండస్ట్రీలో సర్వసాధారణం. అదే విధంగా, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమా కూడా మొదట ఆయనకు కాదట. ఇది మలయాళ సూపర్ హిట్ చిత్రం “అయ్యప్పనుమ్ కోషియుమ్” (Ayyappanum Koshiyum) తెలుగు రీమేక్. ఈ రీమేక్ హక్కులు నిర్మాత సూర్యదేవర నాగ వంశీ (Naga Vamsi) పొందారు.
నాగ వంశీ మొదట ఈ సినిమాను బాలకృష్ణ (Balakrishna)కి చూపించి, అందులో ఒక పాత్ర చేయమని అభ్యర్థించారు. అయితే బాలయ్య ఆ కథను మెచ్చుకొని, “ఈ పాత్రకు పవన్ కల్యాణ్ అయితే అద్భుతంగా ఉంటాడు” అని సలహా ఇచ్చారట. దీనితో నాగ వంశీ పవన్ కల్యాణ్ను సంప్రదించగా, ఆయన కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దర్శకుడు సాగర్ కె చంద్ర (Sagar K Chandra) దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కింది.
ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో పవన్ కల్యాణ్కి జతగా రానా దగ్గుబాటి (Rana Daggubati) కీలక పాత్రలో నటించాడు. హీరోయిన్గా నిత్యా మీనన్, సంయుక్త మీనన్ నటించగా, స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ను త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) అందించారు. ఇతర ముఖ్యమైన పాత్రల్లో మురళీ శర్మ, రావు రమేష్, సముద్రఖని కనిపించారు.
2022 ఫిబ్రవరి 25న విడుదలైన భీమ్లా నాయక్, పవన్ అభిమానులకు పండుగలా నిలిచింది. సుమారు ₹100 కోట్లు పైగా వసూలు చేసిన ఈ సినిమా, పవన్ కల్యాణ్ రీఎంట్రీలో వరుసగా రెండో సూపర్ హిట్గా నిలిచింది. మొదట బాలకృష్ణకు వెళ్లిన కథ, చివరికి పవన్ చేతిలో ఘనవిజయం సాధించింది అనడం అతిశయోక్తి కాదు!