రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త కుమార్తె రాధిక మర్చంట్ వివాహం ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రపంచదేశాల్లోని సినీ స్టార్స్, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు సందడి చేశారు. డబ్ల్యూడబ్ల్యూఈ ప్లేయర్ జాన్ సెనా, హాలీవుడ్ నటి కిమ్ కర్దాషియాన్‌తో పాటు పలువురు ప్రముఖులు ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. ఇక అనంత్ అంబానీ పెళ్లికి వారం రోజుల ముందు నుంచే బాలీవుడ్ తారలు సందడి చేశారు. పెళ్లికి ముందు జరిగే అన్ని వేడుకలలోనూ బీటౌన్ స్టార్స్ కనిపించారు. ఇక నిన్న జరిగిన పెళ్లి వేడుకలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, కత్రీనా కైఫ్, రణవీర్, దీపికా, సారా అలీ ఖాన్, షాహిద్ కపూర్, ధోనీ, సచిన్, రామ్ చరణ్, రజినీకాంత్, మహేష్ బాబు, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

అయితే అనంత్ అంబానీ పెళ్లి వేడుకలలో ఆసక్తికర సీన్ జరిగింది. దీంతో మరోసారి బాలీవుడ్ కపూర్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకుల రూమర్స్ తెరపైకి వచ్చింది. ఈ వివాహానికి సినీ ప్రముఖులంతా కుటుంబ సమేతంగా హాజరయ్యారు. కానీ, ఐశ్వర్యరాయ్ మాత్రం బచ్చన్ ఫ్యామిలీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్, అభిషేక్ బచ్చన్ మొత్తం ఫ్యామిలీతో కలిసి హాజరయ్యారు. కానీ వీరితోపాటు ఐశ్వర్య కనిపించలేదు. కొన్ని కారణాల వల్ల ఐశ్వర్య పెళ్లికి హాజరుకావడం లేదని అనుకున్నారు. కానీ కాసేపటికి తన కూతురు ఆరాధ్యతో కలిసి ఒంటరిగా అనంత్ పెళ్లికి వచ్చింది ఐశ్వర్య రాయ్.

తండ్రి అమితాబ్ తో కలిసి అభిషేక్ రాగా.. కూతురు ఆరాధ్యతో కలిసి ఐశ్వర్య అనంత్ పెళ్లికి వేర్వే్రుగా వచ్చారు. దీంతో మరోసారి ఐష్, అభిషేక్ విడాకులు వార్తలు తెరపైకి వచ్చాయి. బచ్చన్ కుటుంబానికి ఐశ్వర్య దూరంగా ఉంటుందని… ఈ క్రమంలోనే అభిషేక్, ఐశ్వర్య విడిపోయారంటూ ప్రచారం నడించింది. అయితే ఈ వార్తలపై అమితాబ్ కుటుంబం గానీ, ఐశ్వర్య, అభిషేక్ గానీ స్పందించలేదు. కానీ ఇప్పుడు అమితాబ్ ఫ్యామిలీ, ఐశ్వర్య వేరు వేరుగా రావడంతో మరోసారి వీరి విడాకులు అంశం తెరపైకి వచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.