
కోలీవుడ్ స్టార్ ధనుష్ తెలుగులోను మంచి ఫాలోయింగ్ కలిగిన హీరో. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ నాగార్జున తో కలిసి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ‘కుబేర’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ సందర్భంగా ధనుష్ చేసిన వ్యాఖ్యలు సినీ ప్రేమికులను భావోద్వేగానికి గురి చేశాయి.
ధనుష్ మాట్లాడుతూ – “నాగార్జున గారిని చిన్నప్పటి నుంచే ఎంతో అభిమానించేవాణ్ని. ఆయన నటించిన ‘రక్షకన్’ సినిమా నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఇంతమంది అభిమానించే లెజెండ్ తో కలిసి నటించడమనేది నా జీవితంలోని గొప్ప అనుభవాల్లో ఒకటి. షూటింగ్ సమయంలో ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇది ఒక విలువైన జ్ఞాపకం” అని అన్నారు.
ధనుష్ కామెంట్స్ చూసిన అభిమానులు “ఇది రేర్ మ్యూచువల్ రెస్పెక్ట్” అంటూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఒకవైపు కోలీవుడ్ క్రేజ్.. మరోవైపు టాలీవుడ్ లెజెండ్.. వీరిద్దరూ కలిసి నటించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
ఇక సినిమాకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ త్వరలో వెల్లడించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. సినిమా విడుదల తేదీ అధికారికంగా ప్రకటించకపోయినా, దీన్ని 2025 చివర్లో విడుదల చేసే అవకాశాలున్నాయి.