టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్ పేరు ఇప్పుడు నెట్టింట మార్మోగుతుంది. కొన్నాళ్లుగా ఆఫర్స్ తగ్గిపోయి సైలెంట్ అయిన రాజ్ తరుణ్.. ఇటీవలే నా సామిరంగ సినిమాలో కీలకపాత్రలో కనిపించాడు. ఇక ఇప్పుడు తిరగబడరా సామీ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నాడు. కానీ సినిమాకు ముందే రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది. గత వారం రోజులుగా రాజ్ తరుణ్, లావణ్య, హీరోయిన్ మాల్వి మల్హోత్రా పేర్లు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి. ప్రేమ పేరుతో తనతో 11 ఏళ్ల పాటు కలిసి ఉండి ఇప్పుడు మరో అమ్మాయి కోసం తనను దూరం పెడుతున్నాడంటోంది లావణ్య. అలాగే హీరోయిన్ మాల్వీ మల్హోత్రా తనను బెదిరిస్తుందని ఫిర్యాదులో పేర్కొంది.

రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకున్నాడని.. తనకు అబార్షన్ కూడా చేయించడాని ఆరోపించింది లావణ్య. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులకు అందించిన లావణ్య.. శుక్రవారం రాత్రి సూసైడ్ చేసుకుంటున్నట్లు తన న్యాయవాది దిలీప్ సుంకరకు మెసేజ్ పెట్టింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శుక్రవారం అర్దరాత్రి తనకు లావణ్య మెసేజ్ పెట్టిందని.. ఆమెకు న్యాయం చేసేవరకు పోరాడతానని అన్నారు లావణ్య తరపు న్యాయవాది.

లావణ్య న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర మాట్లాడుతూ.. “న్యాయం చేయాలని లావణ్య నన్ను ఆశ్రయించింది. న్యాయబద్ధంగా రాజ్ తరుణ్ లావణ్యతో ఉండాలి. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్న మాట వాస్తవం కాదా. దమ్ముంటే రాజ్ తరుణ్ మీడియా ముందుకు రావాలి. లావణ్య మంచి పిల్ల కాబట్టి ఇంకా రాజ్ తరుణ్ కుక్కలను పెంచుతుంది. నేను ఈ కేసు చూస్తుండగానే రాజేష్ అనే మరో లాయర్ లావణ్యకు ఫోన్ చేశాడు. ఈ కేసు నిలబడదు అని లావణ్యకు మెసేజ్ పెట్టాడు. దీంతో డిప్రెషన్‏కి గురైన లావణ్య ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోవాలనుకుంది. లావణ్య ప్రెగ్నెన్సీ టైంలో బిల్స్ కట్టింది రాజ్ తరుణ్ కాదా. లావణ్యకు డ్రగ్స్ అలవాటు ఉందని రాజ్ తరుణ్ ప్రూవ్ చేయాలి. తప్పుడు కేస్‏లతో ఆమెను ఇరికించారు. ఆమెకు న్యాయం జరిగే వరకు ఆమె తరుపున పోరాడుతాను” అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.