
బాలీవుడ్ ప్రముఖులు సునీల్ శెట్టి మరియు గౌహర్ ఖాన్ మధ్య తాజాగా మాటల యుద్ధం చోటుచేసుకుంది. టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ మరియు నటి అతియా శెట్టి మార్చి 24న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలో అతియాకు తండ్రి అయిన సునీల్ శెట్టి తన కూతురు నార్మల్ డెలివరీ చేయించిందని పేర్కొంటూ, అది ఎంతో కంఫర్టబుల్ అని వ్యాఖ్యానించాడు.
అయితే ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బాలీవుడ్ నటి గౌహర్ ఖాన్ ఇటీవల ఓ టీవీ షోలో మాట్లాడుతూ, “ఎవరైనా సెలబ్రిటీ సీజేరియన్ కన్నా నార్మల్ డెలివరీ ఈజీ అని చెప్పినప్పుడు నాకు గట్టిగా అరవాలనిపించింది” అంటూ భావోద్వేగంతో స్పందించింది. “మగవాళ్లకు ప్రెగ్నెన్సీ బాధలు ఏమైతే ఉంటాయో అర్థం కాదు, సీజేరియన్ బాధలు కూడా తక్కువ కావు” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాతృత్వం, ప్రసవం లాంటి సున్నితమైన విషయాలపై సెలబ్రిటీలు బాధ్యతాయుతంగా మాట్లాడాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అటు సునీల్ తాతయ్యగా ఆనందంలో మునిగి తేలుతుండగా, ఇటు గౌహర్ మరోసారి గర్భంతో ఉండటంతో తన అనుభవంతో మాట్లాడిందని భావిస్తున్నారు.