News June 28, 2024

AP: పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని తన నివాసంలో అధికారులతో భేటీ అయ్యారు. వివిధ శాఖల్లో నిధుల వినియోగం, చేపట్టిన పనుల ప్రస్తుత స్థితిపై ఆరా తీశారు. వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.