గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ వాడకంపై ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు. ఎన్ని చర్యలు తీసుకుంటున్న డ్రగ్స్, గంజాయిని పలు కొత్త దారుల్లో నగరానికి తీసుకువస్తున్నారు కేటుగాళ్లు. పోలీసుల కళ్లు గప్పి యువతకు, వ్యాపారస్తులకు డ్రగ్స్ చేరవేస్తున్నారు. తాజాగా సైబరాబాద్‌లో పోలీసులు చేపట్టిన తనీఖిల్లో భారీగా డ్రగ్స్‌ పట్టుకున్నారు పోలీసులు. ఈ కేసులో నలుగురు నైజీరియన్లతో పాటు ప్రముఖులను అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి రూ.2 కోట్ల విలువైన 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈకేసులో డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్‌ సోదరుడు అమన్‌సింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపించిన సంగతి తెలిసిందే.