హైదరాబాద్: పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నీలం మధు, శశికళ యాదవ్‌తో పాటు పలువురు మహిపాల్‌రెడ్డికి అభినందనలు తెలిపారు.

మహిపాల్ రెడ్డితో పాటు జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్, పలువురు కార్పొరేటర్లు, ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఇప్పటి వరకు పది మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి మారారు. మహిపాల్‌రెడ్డి 2014, 2018, 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి కాటా శ్రీనివాస్‌గౌడ్‌పై వరుసగా విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 7 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తాజాగా ఆయన నివాసంలో ఈడీ దాడులు నిర్వహించింది.