పై ఫొటోలో మిర్రర్ సెల్ఫీతో కుర్రాళ్లను మాయ చేస్తోన్న టాలీవుడ్ ముద్దుగుమ్మను గుర్తు పట్టారా? ఈ అమ్మడు తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సుమారు ప‌ద‌హారేళ్లు పైనే అయ్యింది. తన అందం, అభినయంతో మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా సెటిలైపోతుందనుకున్న ఈ ముద్దుగుమ్మ సెకెండ్ హీరోయిన్ రోల్స్ , క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలకే పరిమితమైపోయింది. పలువురి స్టార్ హీరోల సినిమాల్లో సెకెండ్ హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా గ్లామరస్ రోల్స్ లోనే కనిపించింది. ఈ మధ్యన సినిమాల్లో పెద్దగా కనిపించకున్నాసోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన లేటెస్ట్ గ్లామరస్ ఫొటోలు, వీడియోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తోంది. అలా తాజాగా మిర్రర్ సెల్ఫీ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిందీ అందాల తార. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ గా మారాయి. మరి మత్తెక్కించే కళ్లు, చూపు తిప్పుకోనివ్వని గ్లామర్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ఈ టాలీవుడ్ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా? ఆమె మరెవరో కాదు టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాదాస్.

సిద్ధు ఫ్ర‌మ్ శ్రీకాకుళం సినిమాతో 2008లో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్ర‌ద్ధాదాస్‌. ఆ తర్వాత ఆర్య 2, నాగ‌వ‌ల్లి, డార్లింగ్‌తో పాటు స్టార్ హీరోల సినిమాల్లో కీల‌క పాత్ర‌లు చేసింది. తెలుగుతో పాటు క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ న‌టించింది. హిందీలో ఖాకీతో పాటు మ‌రికొన్ని వెబ్‌సిరీస్‌ల్లో కనిపించింది.

ఇవి కూడా చదవండి

ఇటీవలే పారిజాత పర్వం అనే సినిమాలో నటించింది శ్రద్ధాదాస్. ఇందులో సునీల్‌, చైత‌న్య‌రావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 19న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ సినిమా యావరేజ్ గానే నిలిచింది. అయితే ప్రస్తుతం ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

పారిజాత పర్వం సినిమాలో శ్రద్ధాదాస్.

సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ అమ్మడు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది. రెగ్యులర్ గా తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగోడుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..