సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంటూ చాలా మంది హీరోయిన్స్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో స్టార్స్, దర్శకనిర్మాతల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామంటూ సంచలన కామెంట్స్ చేసినవారు పాయల్ ఘోష్ ఒకరు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెళ్లి సినిమాలో తమన్నా స్నేహితురాలిగా కనిపించింది. ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో నటించిన పాయల్.. హిందీలోనూ పలు సినిమాలు చేసింది. అయితే కొన్నాళ్ల తర్వాత సినిమాలకు దూరమైన పాయల్.. హిందీ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేసింది. ఆ తర్వాత పలువురు క్రికెటర్స్ గురించి అనేక రకాల కామెంట్స్ చేసింది. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న పాయల్.. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్ స్టాలో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు తెగ వైరలవుతుంది. చాలా రోజులు తాను డిప్రెషన్ కారణంగా బాధపడినట్లు తెలిపింది.

తనకు ఎదురైన వేధింపుల గురించి మరోసారి ప్రస్తావిస్తూ.. తాను నిదుర మాత్రలు తీసుకునేదాన్ని అని.. ఒక గ్లాస్ వైన్ తాగనిదే ఇప్పటికీ నిదురపోలేనని వెల్లడించింది. అలాగే డైరెక్టర్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడని.. తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లానని పేర్కొంది. కొన్నేళ్లుగా యాంటీ డిప్రసెంట్ మందులు వాడుతున్నాని.. వాటి వ్లల ట్రామాలోకి వెళ్లానని.. అలాగే అనురాగ్ కశ్యప్ కు కూడా కూతురు ఉందని.. ఆమె కూడా తనలాగే వేధింపులకు గురవుతుందని పాయల్ మరో పోస్ట్ చేసింది. ప్రస్తుతం పాయల్ ఘోష్ చేసిన ఇన్ స్టా పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

పాయల్ ఘోష్ తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెళ్లి సినిమాలో తమన్నా స్నేహితురాలిగా కనిపించింది. ఈ సినిమాతోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే మంచు మనోజ్ నటించిన ప్రయాణం సినిమాలోనూ నటించింది. గతంలోనూ పాయల్ చాలా సార్లు పలువురు క్రికెటర్స్ గురించి అనేక పోస్టులు చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Paayel Ghosh (@iampayalghosh)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.