News June 29, 2024

సైబర్ స్కామ్‌కు పాల్డడ్డారనే ఆరోపణలతో 137 మంది భారతీయులను శ్రీలంక అరెస్ట్ చేసింది. కొలంబోలోని మడివేలా, బత్తరముల్లా, నెగొంబా ప్రాంతాల్లో వీరందరిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరు బెట్టింగ్, జూదం, ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దుబాయ్, అఫ్గానిస్థాన్‌లోనూ వీరు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించారు.