Bollywood Heroes: ఇటీవల భారత అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంటి పెళ్లి వేడుకలు ఎంతో ఘనంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ పెళ్లి వేడుకల కోసం సుమారు 5000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తుంది.

ఇక ఈ పెళ్లి వేడుకలలో భాగంగా సినీ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా రాజకీయ క్రీడా రంగానికి చెందిన వ్యక్తులు వ్యాపారం వేత్తలు కూడా పాల్గొని సందడి చేశారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ తారలందరూ కూడా ఈ పెళ్లి వేడుకకు హాజరై సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు అనంత అంబానీ పెళ్లిలో ఇచ్చిన గిఫ్ట్ లకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అనంత రాధిక మర్చంట్ వివాహపు వేడుకలలో భాగంగా బాలీవుడ్ తారలు అయినా రణబీర్ కపూర్ అలియా భట్ 9 కోట్ల విలువచేసే బెంజ్ కారు, సల్మాన్ 15 కోట్ల విలువచేసే బైక్, రణవీర్ దీపిక 20 కోట్ల రూపాయల విలువ చేసే రోల్స్ రాయిస్, విక్కీ కౌశల్ కత్రినా 19 లక్షల విలువ చేసే బంగారు చైన్, అక్షయ్ కుమార్ 60 లక్షల విలువ చేసే గోల్డెన్ పెన్ కానుకగా ఇచ్చారని తెలుస్తుంది.

40 కోట్ల అపార్ట్మెంట్..
ఇలా వీరంతా కూడా అనంత్ అంబానికి చాలా మంచి స్నేహితులనే విషయం మనకు తెలిసిందే. అయితే బాలీవుడ్ బాద్షా నటుడు షారుఖ్ ఖాన్ మాత్రం ఎవరు ఊహించని విధంగా గిఫ్ట్ ఇచ్చారని తెలుస్తుంది. ఈయన ఈ జంటకు ఫ్రాన్స్ లో 40 కోట్ల రూపాయల విలువ చేసే ఒక అపార్ట్మెంట్ కానుకగా అందించారని సమాచారం. ఇలా బాలీవుడ్ తారలందరూ కూడా కళ్ళు చెదిరిపోయే కానుకలు ఇచ్చారంటూ వస్తున్న ఈ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.