News June 28, 2024

కర్నూలులోని టీజీ నివాసంలో శుక్రవారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంత్రి హోదాలో తొలిసారి తమ నివాసానికి వచ్చిన బీసీ జనార్ధన్ రెడ్డిని మంత్రి టీజీ భరత్ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించుకున్నారు.